తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ‘మిషన్ భగీరథ’ పథకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షితమైన మంచినీటిని అందించినందుకు తెలంగాణ ప్రతిష్టాత్మక పథకం “మిషన్ భగీరథ” జాతీయ అవార్డును గెలుచుకుందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ మార్గదర్శక ప్రాజెక్ట్కు (మిషన్ భగీరథ) రూ.19,000 కోట్లు మంజూరు చేయాలనే నీతి అయోగ్ సిఫార్సును కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గౌరవించగలిగితే అది సముచితంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Telangana’s flagship “Mission Bhagiratha” wins national award for providing safe drinking water to all rural households
Thanks for the recognition but it would be befitting if the NDA Govt can honour the recommendation of NITI Ayog to grant ₹19,000 Cr to this pioneering project https://t.co/hPFDuKwggE
— KTR (@KTRTRS) September 29, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY