భద్రాచలంలో సీతారాముల వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం మిథిలా స్టేడియంలో ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించగా భక్తులు భారీ సంఖ్యలో హాజరై తిలకించారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరియు మంత్రి సత్యవతి రాథోడ్లు పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి గవర్నర్ తమిళిసై పట్టువస్త్రాలు సమర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం గవర్నర్ తమిళిసై గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున కొత్తగూడెం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసైకి ఆలయ ఈవోతో పాటు అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో గవర్నర్ సీతారామ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా గవర్నర్ తమిళిసై రైలులో భద్రాచలం వెళ్లడం ఇది రెండోసారి. గతేడాది భద్రాచలం వరదల సందర్భంగా ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన ఆమె అప్పుడు కూడా రైలులోనే వెళ్లారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE