మార్చి 12న లాస్ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ నుంచి నామినేట్ అయిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నందుకు రాష్ట్రపతి వారిని అభినందించారు. భారతదేశం యొక్క పరిరక్షణ మరియు ప్రకృతితో సామరస్యంగా జీవించే సంప్రదాయాన్ని ప్రదర్శించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారిని ప్రశంసించారు.
ది ఎలిఫెంట్ విస్పరర్స్ షార్ట్ ఫిల్మ్ని గునీత్ మోంగా, కార్తికి గోన్సాల్వేస్, డగ్లస్ బ్లష్, అచిన్ జైన్ నిర్మించగా, కార్తికి గోన్సాల్వేస్ డైరెక్ట్ చేశారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భారత్ తరపున తొలి అవార్డును ఈ షార్ట్ ఫిల్మ్ దక్కించుకుంది. ఆస్కార్ అవార్డు ప్రకటన అనంతరం దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగా అవార్డులను అందుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE