భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. మే 29, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ 4.0 మే 31 వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు భేటీ అయ్యారు. దేశంలో పెరుగుతున్న కేసులు, భవిష్యత్ కార్యాచరణ, లాక్డౌన్ పొడిగింపు తదితర అంశాలపై ప్రధాని మోదీతో అమిత్ షా చర్చించినట్టు సమాచారం.
ముందుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మరికొన్ని రోజులపాటు లాక్డౌన్ పొడిగింపు ప్రతిపాదనలపై మే 28, గురువారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తాజా భేటీ సందర్భంగా అన్ని రాష్ట్రాల సీఎం లు లాక్డౌన్ పొడిగింపుపై వ్యక్తపరిచిన అభిప్రాయాలు, సూచనలను అమిత్ షా ప్రధాని మోదీకి వివరించినట్టు తెలుస్తుంది. రాష్ట్రాలలో ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడకుండా కార్యకలాపాలు కొనసాగించేలా రాష్ట్రాలకు అనుమతిస్తూ మరికొన్ని రోజులు లాక్డౌన్ను కొనసాగించాలని పలు రాష్ట్రాల సీఎంలు అమిత్ షాకు తెలియజేసినట్టు సమాచారం. ఈ క్రమంలో లాక్డౌన్ 5.0 ప్రణాళిక, పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu