భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై నగరంలోనే ఈ రోజు 618 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,246 కి చేరింది. గత 24 గంటల్లో నమోదైన 9 కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 157 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 765 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 11,313 కి చేరింది. ప్రస్తుతం 8,776 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu