తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఈ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. వీటిలో 100 స్థానిక కేసులు కాగా, విదేశాల నుంచి వచ్చిన వారు 64 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఐదుగురు ఉన్నారు. కొత్తగా నమోదైన 100 కేసులతో కలిపి మే 29, శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2008 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఏరియాలో 82 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్, సంగారెడ్డి జిల్లాలలో 2 చొప్పున మొత్తం 100 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 71 కి చేరినట్టు తెలిపారు.
ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 180 కి చేరుకుంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో 237 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఈ 417 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,425 కి చేరింది. కాగా ఇప్పటికే ఈ వైరస్ నుంచి కోలుకుని 1381 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 973 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
Media bulletin
Date: May 29, 2020Status of positive cases of #COVID19 in Telangana. pic.twitter.com/GJwCNVU1PT
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 29, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu