తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజూరోజుకి పెరుగుతుంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు తమిళనాడులోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి పీఏ గా పనిచేస్తున్న దామోదరన్ కరోనా బారిన పడి మృతి చెందారు. దామోదరన్ రెండు రోజుల క్రితమే కరోనా లక్షణాలతో చెన్నై లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. కాగా చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు.
జూన్ 16, మంగళవారం నాటికీ తమిళనాడులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,019 కి చేరింది.అలాగే రాష్ట్రంలో కరోనా వలన మరణించిన వారి సంఖ్య 528 కి చేరింది. 26782 మంది డిశ్చార్జ్ అవగా, ప్రస్తుతం 20709 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు జూన్ 19 నుండి 30 వరకు చెన్నైతో సహా కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూర్ జిల్లాల్లో మళ్ళీ పూర్తిస్థాయిలో కఠిన నిబంధనలతో లాక్డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu