భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనిక బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద చోటుచేసుకున్న ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. వీరమరణం పొందిన 20 మంది భారత జవాన్లకు రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు సహా యావత్ దేశం నివాళులర్పిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలు అమరవీరుల త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నారు. కాగా ఈ ఘర్షణల్లో అమరులైన జవాన్ల పేర్లను భారత సైన్యం విడుదల చేసింది. అమరులైన వారిలో ఒకరు కల్నల్, నాయిబ్ సుబేదార్, హవిల్దార్, సిఫాయి స్థాయి కల్గిన వారు ఉన్నారు.
వీరమరణం పోందిన మన 20 మంది సైనికులు:
- బిక్కుమల్ల సంతోష్ బాబు (కల్నల్) : తెలంగాణ
- నాదూరాం సోరెన్ (నాయిబ్ సుబేదార్) : ఒడిశా
- మన్దీప్ సింగ్ (నాయిబ్ సుబేదార్) : పంజాబ్
- సత్నం సింగ్ (నాయిబ్ సుబేదార్) : పంజాబ్
- కె. పళని (హవిల్దార్) : తమిళనాడు
- సునీల్ కుమార్ (హవిల్దార్) : బిహార్
- బిపుల్ రాయ్ (హవిల్దార్) : ఉత్తర్ప్రదేశ్
- దీపక్ కుమార్ (నాయక్) : రీవా
- రాజేష్ ఓరంగ్ (సిపాయి) : బిర్భుమ్
- కుందన్ కుమార్ ఓఝా (సిపాయి) : సాహిబ్ గంజ్
- గణేష్ రాం (సిపాయి) : కాంకే
- చంద్రకాంత ప్రధాన్ (సిపాయి) : కందమాల్
- అంకుశ్ (సిపాయి) : హమిర్పూర్
- గుర్విందర్ (సిపాయి) : సంగ్రూర్
- గుర్తేజ్ సింగ్ (సిపాయి) : మాన్సా
- చందన్ కుమార్ (సిపాయి) : భోజ్పూర్
- కుందన్ కుమార్ (సిపాయి) : సహస్ర
- అమన్ కుమార్ (సిపాయి) : సమస్థిపూర్
- జైకిశోర్ సింగ్ (సిపాయి) : వైశాలి
- గనేశ్ హన్స్దా (సిపాయి) : తూర్పు సింగ్భూం
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu