రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. జూలై 2, గురువారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 6,04,641 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 19,148 కరోనా పాజిటివ్ కేసులు, 434 కరోనా మరణాలు నమోదయ్యాయి.
అలాగే దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 17,834 కి చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 3,59,860 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 2,26,947 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. మహారాష్ట్రలో కరోనా కేసులు 1,80,298 కి చేరగా, తమిళనాడులో 94,049, ఢిల్లీలో 89,802 కి చేరుకున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu