ఏపీ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. కరోనా పాజిటివ్గా తేలడంతో కొన్ని రోజుల నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మాణిక్యాల రావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Home ఆంధ్ర ప్రదేశ్
- Advertisement -