తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1931 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 12, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 86,475 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 665 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.76% (< 1%) శాతంగా ఉంది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1780 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 63,074 కి చేరింది. ప్రస్తుతం 22,736 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 72.93 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 298, వరంగల్ అర్బన్ జిల్లాలో 144, రంగారెడ్డిలో 124, కరీంనగర్ లో 89, సంగారెడ్డిలో 86, నల్గొండలో 84, ఖమ్మంలో 73, మేడ్చల్ లో 71, సిద్దిపేటలో 71, పెద్దపల్లిలో 64, సూర్యాపేటలో 64, జనగామలో 59, జోగులాంబ గద్వాల్ లో 56, సిరిసిల్లలో 54, నాగర్ కర్నూల్ లో 53, నిజామాబాద్ లో 53, జగిత్యాలలో 52, మంచిర్యాలలో 45, మహబూబ్ నగర్ లో 43, కామారెడ్డిలో 39, భద్రాద్రి కొత్తగూడెంలో 39, వనపర్తిలో 38, మహబూబాబాద్ లో 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu