తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1102 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 15, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 91,361 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 12,120 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 9 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 693 కి పెరిగింది. ఇప్పటివరకు 68,126 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 22,542 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 74.56 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.75 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1102):
- జీహెచ్ఎంసీ – 234
- కరీంనగర్ – 101
- రంగారెడ్డి – 81
- వరంగల్ అర్బన్ – 70
- సంగారెడ్డి – 66
- మేడ్చల్ – 63
- ఖమ్మం – 46
- మహబూబ్ నగర్ – 37
- కామారెడ్డి – 33
- నిజామాబాద్ – 33
- సిద్ధిపేట – 30
- నాగర్ కర్నూల్ – 29
- నల్గొండ – 28
- వరంగల్ రూరల్ – 25
- పెద్దపల్లి – 22
- మహబూబాబాద్ – 21
- వనపర్తి – 19
- మెదక్ – 18
- జోగులాంబ గద్వాల్ – 17
- జనగామ – 16
- భద్రాద్రి కొత్తగూడెం – 15
- ఆదిలాబాద్ – 14
- రాజన్న సిరిసిల్ల – 13
- సూర్యాపేట – 13
- జగిత్యాల – 11
- యాదాద్రి భువనగిరి – 11
- మంచిర్యాల – 9
- ములుగు – 8
- వికారాబాద్ – 8
- నారాయణ్ పేట్ – 4
- నిర్మల్ – 4
- ఆసిఫాబాద్ – 3
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu