ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19, బుధవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలపడంతో పాటుగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా కరోనా వ్యాప్తి పరిస్థితులు, నియంత్రణ చర్యలపై కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu