రాజేంద్రనగర్లోని టీఎస్ఐఆర్డీలో పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 3 మంగళవారం నాడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలుపుతూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయంపై వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆనందాన్ని వ్యక్తం చేసారు. వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో టిఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ, వికారాబాద్ ఎన్నికల ప్రచార సభలో పార్టీని గెలిపిస్తే జిల్లాను చార్మినార్ జోన్లో కలిపి బహుమానంగా ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చి, ఇప్పుడు నిలుపుకున్నారని తెలిపారు. ఈ ప్రాంతం హైదరాబాద్ కు దగ్గరలో ఉండడంతో ఇక్కడి ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని చార్మినార్ జోన్ లో కలిపారని వివరించారు. మరో వైపు వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, బుధవారం ప్రగతి భవన్ లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు.
[subscribe]
[youtube_video videoid=dGSvroR_1L8]