తెలంగాణలో లక్ష 27 వేలు దాటిన కరోనా కేసులు, 836 కి పెరిగిన మరణాలు

Coronavirus, COVID-19, COVID-19 in Telangana, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య లక్ష 27 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2734 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 31, సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,27,697 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 58,264 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 9 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 836 కి పెరిగింది. ఇప్పటివరకు 95,162 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 31,699 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 74.5 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.65 (<1%) శాతంగా ఉంది.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2734):

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu