భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. గత 24 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో 95,735 పాజిటివ్ కేసులు నమోదవగా, 1172 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 10, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 44,65,863 కు, మరణాల సంఖ్య 75,062 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఒకే రోజులో 72,939 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 34,71,783 కు చేరుకుంది.
దేశంలో ఓవైపు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రసుతం కరోనా రికవరీ రేటు 77.7 శాతం గానూ, మరణాల రేటు 1.7 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసుల నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, మరణాలు ఎక్కువుగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 9,19,018 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu