దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. మూడు రోజులుగా లక్షకుపైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1,26,789 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజువారీగా ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం దేశంలో కరోనా తీవ్రతకు అద్దంపడుతోంది. అయితే కొత్తగా నమోదైన 1,26,789 కేసుల్లో 59,907 కేసులు ఒక్క మహారాష్ట్ర రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఏప్రిల్ 8, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,29,28,574 కు చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 685 మరణాలు నమోదుకావడంతో మరణాల సంఖ్య 1,66,862 కు చేరుకుంది.
దేశంలో 9 లక్షలు దాటిన యాక్టీవ్ కేసుల సంఖ్య, రికవరీ రేటు 91.67 శాతం:
ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య మళ్ళీ 9 లక్షలు (9,10,319) దాటింది. మరోవైపు 59,258 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,18,51,393 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 91.67 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.29 శాతంగా ఉంది. ఇక ఏప్రిల్ 7, బుధవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 25,26,77,379 కు చేరుకుంది. గత 24 గంటల్లో 12,37,781 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ