కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో చేరారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నాక పోస్ట్ కోవిడ్ కేర్ కోసం ఎయిమ్స్ లో చేరిన ఆయన, కొన్ని రోజులు చికిత్స తీసుకున్న అనంతరం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో ఆగస్టు 30 న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో డిశ్చార్జ్ సమయంలో వైద్యుల ఇచ్చిన సలహాలకు అనుగుణంగా, పార్లమెంటు సమావేశాలకు ముందు 1-2 రోజుల పాటు పూర్తి వైద్య పరీక్షల కోసం అమిత్ షా మరోసారి ఆసుపత్రిలో చేరినట్టు ఎయిమ్స్ వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu