ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 22, మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం ఢిల్లీకి బయలు దేరనున్నారు. ఈ పర్యటనలో ముందుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. అలాగే కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, హర్షవర్ధన్ లతో కూడా సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నట్టు తెలుస్తుంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు, ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై కేంద్రమంత్రులతో సీఎం వైఎస్ జగన్ చర్చించే అవకాశముంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టుల పెండింగ్ నిధులు, మూడు రాజధానులు, కరోనా, జీఎస్టీ సహా కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశమునట్టు సమాచారం. ఈ రోజు రాత్రి సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలోనే బస చేసి బుధవారం నాడు నేరుగా తిరుపతి చేరుకుని, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu