దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ‘ధరణి‘ పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ధరణి పోర్టల్ రూపకల్పనపై సెప్టెంబర్ 22, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల వర్షాకాల సమావేశాల్లో భాగంగా శాసన సభ, శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన రెవెన్యూ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూముల వివరాలు నిర్వహణపై కీలకమైన ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu