హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. నాయిని నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే నాయిని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయినికి మరింత మెరుగైన చికిత్స అందించాలని అపోలో వైద్యులు, సిబ్బందిని కోరారు. నాయిని నర్సింహారెడ్డి సాధ్యమైనంత తొందరలో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు మంత్రులు ధైర్యం చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu