మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉపఎన్నికకు నామినేషన్ పక్రియ ముగిసింది. ముందుగా మొత్తం 46 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, నామినేషన్ పరిశీలన ప్రక్రియలో వివరాలు సరిగ్గా లేకపోవడంతో 12 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఇక మిగిలిన 34 మంది అభ్యర్థుల్లో ఈ రోజు మరో 11 మంది తమ నామినేషన్లలను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు నిలిచినట్లు తాజాగా ఎన్నికల అధికారుల ప్రకటించారు.
దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచిన 23 మంది అభ్యర్థులు వీరే:
- చెరుకు శ్రీనివాస్రెడ్డి – కాంగ్రెస్
- ఎం రఘునందన్ రావు – బీజేపీ
- సోలిపేట సుజాత- టిఆర్ఎస్
- కత్తి కార్తీక – ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్
- గౌతీ మల్లేష్ – జై స్వరాజ్
- జాజుల భాస్కర్ – శ్రమజీవిపార్టీ
- ఎం సునీల్ – ఇండియా ప్రజా బంద్ పార్టీ
- సుకూరి అశోక్ – రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా
- అందర్పు సుదర్శన్ – ఇండిపెండెంట్
- అన్నా బుర్ర రవి తేజ గౌడ్ – ఇండిపెండెంట్
- అన్నా రాజ్ – ఇండిపెండెంట్
- కంటే సాయన్న – ఇండిపెండెంట్
- కొట్టాల యాదగిరి ముదిరాజ్- ఇండిపెండెంట్
- కోట శ్యామ్ కుమార్ – ఇండిపెండెంట్
- విక్రమ్ రెడ్డి వేముల – ఇండిపెండెంట్
- బండారు నాగరాజ్ – ఇండిపెండెంట్
- పీ.ఎం బాబు – ఇండిపెండెంట్
- బుట్టెమ్ గారి మాధవ రెడ్డి – ఇండిపెండెంట్
- మోతె నరేష్ – ఇండిపెండెంట్
- రణవేని లక్ష్మణ్ రావు – ఇండిపెండెంట్
- రాపెల్లి శ్రీనివాస్ – ఇండిపెండెంట్
- వడ్ల మాధవాచారి – ఇండిపెండెంట్
- సిలివేరు శ్రీకాంత్ – ఇండిపెండెంట్
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu