పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అమరవీరులైన పోలీసు సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు చేసిన ఆదర్శప్రాయమైన సేవలను సీఎం గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ కోసం పోలీసు అమరవీరులు చేసిన అత్యున్నత త్యాగాలను దేశం, దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోరని సీఎం కేసీఆర్ అన్నారు. అమరవీరులు తమ ప్రాణాలను అర్పించిన ఉన్నతమైన ఆదర్శాలకు పోలీసు బలగాలు పునరంకితం కావాలని సీఎం కోరుకున్నారు. అమరవీరుల కుటుంబ సభ్యుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu