తెలంగాణ రాష్ట్రంలో మరో 1579 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 20, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,26,124 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో ఐదుగురు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1287 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతంగా ఉంది.
ఇక కరోనా నుంచి కొత్తగా 1811 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 2,04,388 కి చేరింది. ప్రస్తుతం 20,449 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 90.38 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 256, మేడ్చల్ లో 135, ఖమ్మంలో 106, రంగారెడ్డిలో 102, నల్గొండలో 90, భద్రాద్రి కొత్తగూడెంలో 87, కరీంనగర్ లో 64, వరంగల్ అర్బన్ లో 59, సిద్దిపేటలో 53, కామారెడ్డిలో 48, సంగారెడ్డిలో 47, సూర్యాపేటలో 36 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu