ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:
- 10 కీలక రంగాల మెరుగుదల కోసం పీఎల్ఐ పథకాన్ని కేబినెట్ ఆమోదించింది. భారతదేశం యొక్క ఉత్పాదక సామర్థ్యాలు మరియు ఎగుమతులను మెరుగుపరచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, ఎలక్ట్రోనిక్/టెక్నాలజీ ప్రొడక్ట్స్, ఆటో మొబైల్స్ అండ్ ఆటో కంపోనెంట్స్, ఫార్మా, టెలికం అండ్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్, టెక్స్ట్ టైల్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, సోలార్ ఫోటోవోల్టిక్, వైట్ గూడ్స్ (ఏసీ, ఎల్ఈడి), స్పెషలిటీ స్టీల్ వంటి పది రంగాలకు 5 సంవత్సరాల పీరియడ్ లో రూ.1,45,980 కోట్ల విలువైన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలకు వర్తింపచేసినట్టు తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్ రంగం గరిష్టంగా 57,042 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని అందుకుంది.
- మరోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) కింద ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాల (పీపీపీ) పథకాలకు మరింత ఆర్ధిక సాయం, ఊతమిచ్చేందుకు 2024-25 వరకు రూ.8100 కోట్ల రూపాయల కేటాయింపుకు ఆమోదం తెలిపినట్టు మంత్రి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ