వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడడంపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కీలక ప్రకటన చేశాడు. తన అభిమానులకు శుభవార్త అందిస్తూ, ఐపీఎల్-2023లో తాను ఆడుతానని ఎంఎస్ ధోని సృష్టం చేశాడు. శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ తో సీఎస్కే చివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలో మాట్లాడుతూ వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడబోతున్నట్టు ధోని తెలిపాడు. “ఖచ్చితంగా ఐపీఎల్ 2023 ఆడతాను. అందుకు కారణం ఏంటంటే చెన్నైలో ఆడకుండా అభిమానులకు ధన్యవాదాలు చెప్పడం అన్యాయం. సీఎస్కే అభిమానులు జట్టుపై మరియు వ్యక్తిగతంగా నాపై ఎంతో ప్రేమ చూపించారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జట్లు వివిధ వేదికల్లో ఆడే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. కాబట్టి మేము వివిధ వేదికలలో ఆడే సమయంలో అన్ని విభిన్న ప్రదేశాల్లోని అభిమానులకు ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇక అదే నా చివరి సంవత్సరం అవుతుందా లేదా అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే రాబోయే రెండేళ్లలో ఏమి జరుగుతుంది అనే దాని గురించి నిజంగా అంచనా వేయలేమని మీకు తెలుసు. కానీ వచ్చే ఏడాది బలంగా తిరిగి రావడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తాను” అని ఎంఎస్ ధోని పేర్కొన్నాడు.
మరోవైపు ఐపీఎల్-2022లో సీఎస్కే జట్టు అంచనాలకు తగినట్టుగా రాణించలేదు. ఈ సీజన్ నుంచి ప్లే ఆప్స్ కు చేరకుండానే సీఎస్కే జట్టు నిష్క్రమించింది. ముందుగా రవీంద్ర జడేజా నాయకత్వంలో 8 మ్యాచులు ఆడిన సీఎస్కే జట్టు, రెండు విజయాలు సాధించగా, ఆరు మ్యాచుల్లో పరాజయం పాలయింది. అనంతరం ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 6 మ్యాచులు ఆడి, రెండు విజయాలు సాధించి, నాలుగు మ్యాచుల్లో పరాజయం పొందింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF