దేశవ్యాప్తంగా ఉత్కంఠకు గురిచేస్తున్న మహారాష్ట్ర రాజకీయాలలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలలో ఎవరైనా నన్ను ముఖ్యమంత్రిగా వద్దనుకుంటే తక్షణం రాజీనామా చేసేందుకు నేను సిద్ధమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే సూటిగా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఆయన ప్రసంగం లోని కొన్ని ముఖ్యాంశాలు..
- మీతో చెప్పాల్సింది చాలా ఉంది, ఈ రోజు చాలా ప్రశ్నలకు నేను సమాధానమిస్తాను.
- నాకు ఈరోజు కరోనా పాజిటివ్ వచ్చింది, అయితే తీవ్ర లక్షణాలు లేవు.
- శివసేన ఎప్పటికీ హిందుత్వ స్టాండ్నే తీసుకుంటుంది. హిందూమతం, శివసేన ఎప్పుడూ కలిసే ఉంటాయి.
- నేను ప్రజల్నికలవడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారు, కానీ ప్రస్తుతం దేశంలో టాప్-5 ముఖ్యమంత్రులలో నేను ఒకడిననే విషయం మర్చిపోతున్నారు.
- శివసేన వ్యవస్థాపకులు, మనందరికీ తండ్రిలాంటి వారైన బాలా సాహెబ్ బాల్ఠాక్రే వారసత్వాన్ని కొనసాగించేంది మేమే అని స్పష్టం చేయదలుచుకున్నాను.
- గడచిన 25, 30 ఏళ్లుగా శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలను వ్యతిరేకించింది. కానీ గత ఎన్నికల తర్వాత శరద్పవార్ స్వయంగా నన్నే సీఎం బాధ్యతలు స్వీకరించమని కోరారు.
- బాధ్యతల్ని సవాల్గా స్వీకరించి పనిచేశాను, ఎన్సీపీ, కాంగ్రెస్ నాకు పూర్తి సహకారం అందించాయి.
- నా సొంత పార్టీ నేతలే నన్ను వ్యతిరేకించడంతో షాక్ అయ్యాను, వారిలో ఎవరైనా నన్ను వద్దనుకుంటే సీఎంగా తప్పుకుంటా.
- నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది, పార్టీ ఎమ్మెల్యేలలో ఎవరైనా దీనిని గవర్నర్కు సమర్పించవచ్చు.
- ముఖ్యమంత్రి పదవినుంచి కాదు, శివసేన చీఫ్గా దిగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.
- చర్చలకు రావాలని రెబల్ ఎమ్మెల్యేలను, ఏక్నాథ్ షిండేను ఆహ్వానిస్తున్నా.. నాతో షిండే నేరుగా మాట్లాడాలి.
- ఒకవేళ ప్రభుత్వం కూలిపోయినా మళ్లీ ఎన్నికలకు వెళ్లి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం, శివసేనకు ఆ సత్తా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY