ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. నవంబర్ 30, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,68,064 కు, మరణాల సంఖ్య 6992 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 40,728 కరోనా పరీక్షలు నిర్వహించగా 381 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో నలుగురు మరణించారు.
రాష్ట్రంలో కరోనా వలన కృష్ణా జిల్లాలో ఒకరు, చిత్తూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, అనంతపూర్ లో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6992 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 8,53,232 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లో 934 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7840 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ