ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 5, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,587 కు చేరుకుంది. సోమవారం 9AM నుంచి మంగళవారం 9AM వరకు 51,420 కరోనా పరీక్షలు నిర్వహించగా 377 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన కృష్ణా, గుంటూరు, చిత్తూరు మరియు విశాఖపట్నంలో ఒక్కొక్కరు మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 7122 కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 278 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,73,427 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3038 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ



































