నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది – ఆనం రామనారాయణ రెడ్డి

Anam Ramanarayana Reddy, Anam Ramanarayana Reddy comments on Nellore city, AP Breaking News, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, Nellore Political News, Todays News Headlines, YCP Leader Anam Ramanarayana Reddy

వైసీపీ నాయకుడు, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు నగర వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారిందని వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలో భూ మాఫియా, మద్యం, ఇసుక మాఫియా పెరిగిపోయిందని, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు, ఏది కావాలన్నా నెల్లూరు నగరంలో ఉందని చెప్పారు. ఇలాంటి మాఫియాల ఆగడాలు బయటకు చెప్పుకోలేక నెల్లూరు నగరంలో వేలాది కుటుంబాలు, ప్రజలు కుమిలిపోతున్నారని అన్నారు. చర్చలు తీసుకోవాలనుకునే అధికారులకు ఉద్యోగ భద్రత అడ్డువస్తుందని, గడిచిన ఐదు సంవత్సరాల్లో నలుగురు ఎస్పీలు మారిన ఘనత ఒక్క నెల్లూరు జిల్లాకే దక్కుతుందని ఆనం రామనారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 3 =