జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనవరి 9 శనివారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దివిస్ ఫార్మా కంపెనీ ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
“తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న దివిస్ ఫార్మా పరిశ్రమ తమ జీవితాలపై దుష్ప్రభావం చూపుతుందని ఆందోళన చేస్తున్న ప్రజలకు మద్దతు పలికేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 9వ తేదీన ఆ ప్రాంతంలో పర్యటించి మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. తొలుత ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు పవన్ కళ్యాణ్ తుని చేరుకొంటారు. అక్కడి నుంచి దివిస్ లాబొరేటరీస్ కాలుష్యం వల్ల ఉపాధి కోల్పోయి తీవ్ర ప్రభావానికి లోనయ్యే దానవాయిపేట, కొత్తపాకలు పరిసర ప్రాంతాలకు వెళ్తారు. ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికులను, ఇటీవల పోలీసుల లాఠీచార్జీలో గాయపడినవారిని పరామర్శిస్తారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు” అని జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ