దివిస్ ప్రభావిత ప్రాంతాల్లో జనవరి 9 న పవన్ కళ్యాణ్ పర్యటన

Divis Pharma Company, Divis Pharma Company Affected Areas, Janasena Party, JanaSena Party Chief Pawan Kalyan, Mango News Telugu, pawan divis tour, pawan divis tour news, pawan divis tour updates, pawan kalyan, Pawan Kalyan Divis Pharma Company, Pawan Kalyan Divis Pharma Company Tour, Pawan Kalyan will Tour in Divis Pharma Company Affected Areas

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనవరి 9 శనివారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దివిస్ ఫార్మా కంపెనీ ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.

“తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న దివిస్ ఫార్మా పరిశ్రమ తమ జీవితాలపై దుష్ప్రభావం చూపుతుందని ఆందోళన చేస్తున్న ప్రజలకు మద్దతు పలికేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 9వ తేదీన ఆ ప్రాంతంలో పర్యటించి మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. తొలుత ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు పవన్ కళ్యాణ్ తుని చేరుకొంటారు. అక్కడి నుంచి దివిస్ లాబొరేటరీస్ కాలుష్యం వల్ల ఉపాధి కోల్పోయి తీవ్ర ప్రభావానికి లోనయ్యే దానవాయిపేట, కొత్తపాకలు పరిసర ప్రాంతాలకు వెళ్తారు. ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికులను, ఇటీవల పోలీసుల లాఠీచార్జీలో గాయపడినవారిని పరామర్శిస్తారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు” అని జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 2 =