దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 12,408 పాజిటివ్ కేసులు, 120 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,08,02,591 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,54,823 కి పెరిగింది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో ప్రతి మిలియన్ జనాభాకు నమోదైన కరోనా కేసులతో పోలిస్తే భారత్ (7,828) లోనే అత్యల్పంగా ఉన్నాయి. మరోవైపు పద్నాలుగు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ లో, ఆసుపత్రుల్లో 1,51,460 (1.40%) మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొత్తగా 15,853 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,04,96,308 చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.16 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.43 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఫిబ్రవరి 5, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 19,99,31,795
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,08,02,591
- కొత్తగా నమోదైన కేసులు [ఫిబ్రవరి 4–ఫిబ్రవరి 5 (8AM-8AM)] : 12,408
- నమోదైన మరణాలు : 120
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,04,96,308
- యాక్టీవ్ కేసులు : 1,51,460
- మొత్తం మరణాల సంఖ్య : 1,54,823
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ