తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షకు సంబంధించి విద్యా శాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శుక్రవారం నాడు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సమక్షంలో ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూహెచ్ అధికారులు సమావేశమై ఎంసెట్ పరీక్ష షెడ్యూల్, సిలబస్ సహా తదితర అంశాలపై కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంసెట్లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్ విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు.
అలాగే ఇక ఎంసెట్ సిలబస్ కు సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్, ద్వితీయ సంవత్సరం నుంచి 70 శాతం సిలబస్ ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఎంసెట్ సిలబస్ ను విడుదల చేయనున్నట్లు చిత్రా రామచంద్రన్ తెలిపారు. అలాగే జూన్ 14 తరువాత ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ