దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రికాషన్ డోస్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతుండడంతో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మళ్ళీ ఊపందుకుంది. దేశంలో ప్రస్తుతం 12 ఏళ్లు పైబడివారందరికీ వ్యాక్సిన్ పంపిణీతో పాటుగా, 18-59 సంవత్సరాల వయస్సు వారికి ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రికాషన్ డోస్ పంపిణీ కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలో జూన్ 25, శనివారం ఉదయం 7 గంటల వరకు ప్రజలకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 196.94 కోట్లు (1,96,94,40,932) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉచిత కేటగిరీ, ప్రత్యక్ష రాష్ట్ర సేకరణ కేటగిరి ద్వారా మొత్తం 193.53 కోట్లకుపైగా (1,93,53,58,865) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించగా, ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 12.14 కోట్లకు పైగా (12,14,44,440) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఇక 12-14 సంవత్సరాల వయస్సు గల వారికి మార్చి 16, 2022న కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభించగా, ఇప్పటివరకు 3.62 కోట్లమందికిపైగా (3,62,20,781) మొదటి డోస్ వ్యాక్సిన్, 2,23,36,175 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ అందించినట్టు వెల్లడించారు. అదేవిధంగా 18-59 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఏప్రిల్ 10 నుండి కోవిడ్-19 ప్రికాషన్ డోస్ అందించడం ప్రారంభమవగా, ఇప్పటివరకు 47,00,553 మంది ప్రికాషన్ డోస్ తీసుకున్నారు. ఇక 60 సంవత్సరాలు పైబడినవారికీ ప్రభుత్వం ఉచితంగా ప్రికాషన్ డోస్ డోస్ అందిస్తుండగా, ఇప్పటివరకు 2,33,65,301 మంది తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY