దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే పొరుగు, ముఖ్య భాగస్వామి దేశాలతో పాటుగా ఇతర దేశాలకు కూడా దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కరోనా మహమ్మారిపై పోరాటంలో ఇతర దేశాలకు సహాయపడేందుకు కరోనా వ్యాక్సిన్ల సరఫరాకి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26, శుక్రవారం నాటికీ భారత్ నుంచి ప్రపంచంలోని పలుదేశాలకు 3.61 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ను సరఫరా చేశారు.
ఇందులో 67.5 లక్షల డోసులను గ్రాంట్ సహాయంగా, 294.44 లక్షల డోసులను వాణిజ్య ప్రాతిపదికన(కమర్షియల్) అందజేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్ వ్యాక్సిన్ సరఫరా చేసిన దేశాల్లో బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్, మాల్దీవులు, మారిషస్, సీషెల్స్, శ్రీలంక, బహ్రెయిన్, బ్రెజిల్, మొరాకో, ఒమన్ ఈజిప్టు, అల్జీరియా, సౌత్ ఆఫ్రికా, కువైట్, యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్, బార్బడోస్, డొమినికా, మెక్సికో, డొమినికన్ రిపబ్లిక్, ఎల్ సాల్వడార్, అర్జెంటైనా, సెర్బియా, మంగోలియా, ఉక్రెయిన్, ఘనా వంటి దేశాలు ఉన్నాయి. ఇకపై కూడా దశలవారీగా ఇతర దేశాలకు కరోనా పంపిణీ జరుగుతుందని చెప్పారు. అయితే దేశీయ అవసరాలకు సరిపడా తగినన్ని కరోనా వ్యాక్సిన్ నిల్వలు ఉండేలా చూస్తారని, ఆతర్వాతనే విదేశాలకు కరోనా వ్యాక్సిన్ సరఫరా ఉంటుందని కేంద్రం పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ