దేశంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం వంటి నాలుగు రాష్ట్రాలు, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు చోట్ల ఎన్నికలకు సంబంధించి నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయనున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో నాలుగు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. అలాగే వీటితోపాటుగా తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి లలో అసెంబ్లీ ఎన్నికలను ఈసారి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే ఆయా రాష్ట్రాల్లోని అధికార, ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తమ ప్రచార వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే మరోసారి దేశంలో పెద్దఎత్తున ఎన్నికల సందడి మొదలు కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ