తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటికే 54 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఈ స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో తుది ఫలితం వెల్లడయ్యేందుకు మరింత సమయం పట్టనుంది. 54 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,11,190 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 83,629 ఓట్లు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కు 70,472 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి 39,268 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ కు 27,713 ఓట్లు పోలయ్యాయి. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్న కంటే 27,561 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,10,840 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కు 70,072 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి కి 39,107 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ కు 27,588 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఏడు రౌండ్లలో 21,636 ఓట్లను చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఈ స్థానంలో గెలుపొందాలంటే అభ్యర్ధికి మొత్తం 1,83,167 ఓట్లు రావాల్సి ఉంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరామ్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ