భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) లోకి చేరికల పర్వం కొనసాగుతుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఒడిశా రాష్ట్రంలోకి విస్తరించింది. ఒడిశాకి చెందిన పలువురు ముఖ్యనేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత గిరిధర్ గమాంగ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గిరిధర్ గమాంగ్ కు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
గిరిధర్ గమాంగ్ తో పాటు ఒడిశాకు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎంపీలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో జయరాం పాంగీ, హేమ గమాంగ్, శిశిర్ గమాంగ్, సౌర్య గమాంగ్, నబీన్ నంద, రామచంద్ర హన్ష్దా, బృందావన్ మఝు, రాతా దాస్, భగీరథి సేతి, మయదార్ జేనా, నాబా నిర్మాణ్ క్రుషక్ సంగతన్ (ఎన్ఎన్కేఎస్) కన్వీనర్ అక్షయ్ కుమార్ వంటి కీలక నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వీరందరిని బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, పార్టీ కండువాలు కప్పారు. కాగా ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ జనవరి 25న బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ముందుగా జనవరి 13 ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో గిరిధర్ గమాంగ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో గిరిధర్ గమాంగ్ కుమారుడు శిశిర్ గమాంగ్, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయ పరిస్థితులు, ఒడిశా రాష్ట్ర రాజకీయాలు గురించి ఇరువురూ నేతలు చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కీలక నేతలతో కలిసి గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE