తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడుతూ,ఒక దళితుడిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, చేయకుండా దళితులను కెసిఆర్ మోసం చేసారని విమర్శించారు. అధికారంలోకి రాగానే దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తామని హామీ ఇచ్చి, వ్యవసాయానికి పనికిరాని భూములని పంచారని పేర్కొన్నారు.
లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ భవన్ వద్ద భాజపా చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు, అక్కడి అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేఖం చేసారు, మీడియాతో మాట్లాడుతూ సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ భవన్ అద్భుతంగా నిర్మిస్తామని హామీ ఇచ్చిన మూడేళ్ల తర్వాత కూడా అంబేద్కర్ భవన్ను ఎందుకు నిర్మించలేదని బిజెపి నాయకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.