కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 9 కోట్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీగా అందించే వ్యాక్సిన్ డోసులు సంఖ్యను బట్టి, రోజుకు సగటున 34,30,502 డోసులతో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 45 ఏళ్లు పైబడినవారికి వారందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 9 కోట్లు (9,01,98,673) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
ఇందులో 89,68,151 హెల్త్ కేర్ వర్కర్స్(మొదటి డోస్), 54,18,084 హెల్త్ కేర్ వర్కర్స్(సెకండ్ డోస్), 97,67,538 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోస్), 44,11,609 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు), 2,36,94,487 మంది 45 ఏళ్లు పైబడినవారికీ (మొదటి డోసు), 4,66,662 మంది 45 ఏళ్లు పైబడినవారికీ (సెకండ్ డోసు), 3,63,32,851 మంది 60 ఏళ్లు పైబడినవారికీ (మొదటి డోసు), 11,39,291 మంది 60 ఏళ్లు పైబడినవారికీ (సెకండ్ డోసు) కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 82వ రోజైన ఏప్రిల్ 7, బుధవారం నాడు దాదాపు 30 లక్షల ( 29,79,292) కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ