ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-సుకమ జిల్లాల సరిహద్దుల్లో ఏప్రిల్ 3 న జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఐదురోజుల అనంతరం గురువారం నాడు రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు విడుదల చేశారు. ముందుగా రాకేశ్వర్ సింగ్ తమ వద్ద సురక్షితంగానే బందీగా ఉన్నట్లు ఏప్రిల్ 5న లేఖతో పాటు, ఆయన ఫొటోను మావోయిస్టులు విడుదల చేశారు. దీంతో మావోయిస్టులు చెర నుంచి ఆయన్ను విడిపించాలని రాకేశ్వర్ సింగ్ భార్య మీనూ, కుమార్తె శ్రాగ్వి ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విజ్ఞప్తి చేశారు.
అనంతరం జవాన్ ను విడుదల చేస్తామని ఛత్తీస్ గడ్ ప్రభుత్వానికి మావోయిస్టు బృందం హామీ ఇచ్చి, విడుదలపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వ మధ్యవర్తుల పేర్లను కోరారు. ఈ క్రమంలోనే రాకేశ్వర్ సింగ్ విడుదల అయ్యారు. విడుదల అనంతరం ఆయన బీజాపూర్ లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ కు చేరుకున్నారు. మరోవైపు ఏప్రిల్ 3 న జరిగిన ఘటనలో 22 మంది జవాన్లు అమరులయ్యారు. పలువురు భద్రతా సిబ్బందికి గాయాలవగా, వారికీ బీజాపూర్, రాయ్పూర్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ