ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 515 జెడ్పీటీసీ స్థానాల్లో మరియు 7220 ఎంపీటీసీ స్థానాల్లో గురువారం నాడు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పూర్తి ఓటింగ్ శాతం ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
మరోవైపు ఎస్ఈసీ నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించాల్సి ఉండగా, ఈ ఎన్నికల నిర్వహణపై విచారణ సందర్భంగా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కౌంటింగ్ పక్రియను నిలిపివేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి ఉత్తర్వుల అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై స్పష్టత రానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ