టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (67) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గిరిజన ప్రజల సమస్యలపై పోరాటం చేసిన చందూలాల్ నాయకుడిగా మంచి పేరు సంపాదించారు. ఎన్టీఆర్ హయాంలో మరియు తెలంగాణ రాష్ట్ర తోలి కేబినెట్ లో మంత్రిగా సేవలు అందించారు. చందూలాల్ మృతిపట్ల సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సంతాపం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చందూలాల్, ములుగు శాసనసభా స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు వరంగల్ ఎంపీగా గెలుపొందారని, రెండుసార్లు మంత్రి పదవి చేపట్టి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని సీఎం గుర్తు చేసుకున్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో తన కేబినెట్ లో గిరిజన సంక్షేమం, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్రానికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. మాజీ మంత్రి చందూలాల్ మరణం తీరనిలోటని అన్నారు. చందూలాల్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
“మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి పట్ల తీవ్రసంతాపాన్ని తెలుపుతున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. తెలంగాణ రాష్ట్ర సాధనలో, తెలంగాణ తొలి మంత్రివర్గంలోసభ్యుడిగా తనదైన పాత్రను పోషించారు. గిరిజనుల సమస్యలపరిష్కారం కోసంఎంతో కృషిచేశారు” మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ