తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రి 9.00 గంటలనుండి ఉదయం 5.00 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
ముందుగా కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ 20వ తేదీ రాత్రి నుంచి మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరోనాకేసులు పెరుగుదల కొనసాగుతుండడంతో నైట్ కర్ఫ్యూను మే 8 వరకు పొడిగించారు. తాజాగా మరో వారం రోజులు పొడిగిస్తూ మే 15 ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుందని పేర్కొన్నారు. నైట్ కర్ఫ్యూ సమయంలో అన్ని కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, షాపింగ్మాల్స్, దుకాణాలు, థియేటర్లు, రెస్టారెంట్లు మొదలైనవి రాత్రి 8.00 గంటలకు మూసివేయాల్సి ఉంటుంది. ఇక ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ ల్యాబ్లు, ఫార్మసీలు, ఇతర అవసరమైన సేవలకు మినహాయింపు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ