దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. 71 రోజుల తరవాత దేశంలో తక్కువుగా(80834) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వరుసగా 31వ రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు కంటే రికవరీలు ఎక్కువుగా ఉన్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 80834 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,94,39,989 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 3303 మంది మరణించడంతో మరణాల సంఖ్య 3,70,384 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 10,26,159 (3.49%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
కొత్తగా తమిళనాడు (15,108), కేరళ (13,832), మహారాష్ట్ర (10,697), కర్ణాటక (9,785), ఆంధ్రప్రదేశ్ (6,952), ఒడిశా (4,852), వెస్ట్ బెంగాల్ (4,286), అస్సాం (3,463), తెలంగాణ (1,771), పంజాబ్ (961) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 1,32,062 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 2,80,43,446 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 95.26 శాతం గానూ, మరణాల రేటు 1.26 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ