తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 15, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,802 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరొకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1619 కి పెరిగింది. ఇక గత 24 గంటల్లో 161 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 2,93,540 కు చేరుకుంది. ప్రస్తుతం 1,643 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాడు 24,851 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 83,36,255 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 2,23,972 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ