ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఏపీపీఎస్సీలో గ్రూప్-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దుచేస్తునట్టు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల ఎంపికలో ఇకపై ఇంటర్వ్యూలు ఉండబోవని, పోటీ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఉత్తర్వులు వెలువడిన రోజు నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ