తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ : కోటికి పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India Covid Vaccination, Mango News, Vaccine Distribution

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా కోటి వ్యాక్సిన్ డోసులు పంపిణీ పూర్తయింది. జూన్ 25, శుక్రవారం రాత్రి 9 గంటల వరకు 86,30,091 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 14,49,131 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కలిపి మొత్తం 1,00,79,222 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా శుక్రవారం నాడు 2,00,682 మందికి మొదటి డోస్, 16730 మందికి రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్టంలో కోటి మందికి టీకా వేయడం పూర్తియైన సందర్భంగా కేక్ కట్ చేసి ఆరోగ్య శాఖ అధికారులను, ఉద్యోగులను, క్షేత్రస్థాయి సిబ్బందిని, ఆశావర్కర్లను అభినందించారు. ఈ సందర్భంగా మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్ ను ప్రారంభించారు. అదేవిధంగా వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శాఖ రూపొందించిన వీడియో సాంగ్ విడుదల చేశారు. ప్రజలందరు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ, నేడు చారిత్రాత్మకమైన రోజు అని, 1 కోటి టీకాలను ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా ఒక పద్దతిలో ప్రణాళికాయుతంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ తో ప్రారంభించి హై రిస్క్ గ్రూపు, సూపర్ స్ప్రెడర్స్ ముందస్తు గా గుర్తించి వ్యాక్సినేషన్ ఇవ్వడం వలన సమర్ధవంతంగా కోవిడ్ వ్యాప్తిని అరికట్టగలిగినట్లు తెలిపారు. రాష్ట్రంలో 2 కోట్ల 20 లక్షల మందికి కోవిడ్ టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయిస్తే, ఒక కోటి మైలురాయిని అధిగమించినట్లు తెలిపారు. వారిలో 26 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లకు టీకాలు వేసినట్లు తెలిపారు.

ఈ కేటగిరిలలో మిగిలిపోయిన వ్యక్తులకు కోవిడ్ టీకాలు ఇచ్చుటకై 30 మోబైల్ వాహనాల ద్వారా పని ప్రదేశాలలోనే టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఆదే విధంగా టీచర్లకు కూడా టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన వయసు ఉన్న వ్యక్తులందరికి టీకాలు ఇచ్చు కార్యక్రమాన్ని కోనసాగిస్తున్నట్లు సీఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా.రమేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.జి.శ్రీనివాస్ రావు, ఆరోగ్య శాఖ ఓ.ఎస్.డి డా.టి గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − thirteen =