భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతానికి 1-1 తో సమమైన సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియగా, రెండో టెస్టులో భారత్, మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించాయి. ఇక ఇరు జట్ల మధ్య నాలుగోటెస్ట్ సెప్టెంబర్ 2 నుంచి లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టులో భారత్ తో తలపడే 15 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్వుడ్ ప్రకటించారు. కాగా ఇంగ్లాండ్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి.
వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ జోస్ బట్లర్ తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనున్నడంతో, వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఓవల్ టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో బట్లర్ స్థానంలో రిజర్వ్ వికెట్ కీపర్ గా సామ్ బిల్లింగ్స్ జట్టులోకి వచ్చాడు. అయితే నాలుగో టెస్ట్లో వికెట్కీపింగ్ బాధ్యతలను జానీ బెయిర్స్టో నిర్వహిస్తాడని కోచ్ క్రిస్ సిల్వర్వుడ్ చెప్పారు. అలాగే ఫాస్ట్ బౌలర్ సకీబ్ మహమూద్ స్థానంలో మడమ గాయం నుంచి కోలుకున్న ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ ను తిరిగి టెస్ట్ జట్టుకు ఎంపిక చేసినట్టు తెలిపారు.
ఇంగ్లాండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, మొయిన్ అలీ, జానీ బెయిర్స్టో (కీపర్), సామ్ బిల్లింగ్స్, రోరీ బర్న్స్, సామ్ కర్రన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, డేవిడ్ మలాన్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ