తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో కోకాపేట భూముల అమ్మకాలపై విచారణ జరిపించాలని సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సీబీఐ డైరెక్టర్ ను కలిసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కోకాపేట భూముల అమ్మకాలపై ప్రధాని మోదీ,హోం మంత్రి అమిత్ షాను కూడా కలిసి విచారణ జరిపించాలని కోరుతామని చెప్పారు. ఈ భూముల అమ్మకాలతో తెలంగాణ రాష్ట ఖజానాకు రూ.1500 కోట్లు నష్టం వచ్చిందన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరపున సీబీఐ డైరెక్టర్ ని కలిసి, రాత పూర్వకమైన నివేదిక ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ విషయంలో విచారణ కోరి బీజేపీ నేతలు కూడా తమ నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ